భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా సాలూరు పట్టణం చిన్న హరిజనపేట లో నివాసం ఉండే సింగారపు తౌడు అనే వ్యక్తి విద్యా శాఖలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇతనికి కొన్నేళ్ల క్రితం జయంతితో పెళ్లైంది వారికి పిల్లలు కూడా ఉన్నారు. ఆమెతో సరసాల్లో మునిగి తేలుతున్నాడు. పూర్తిగా ప్రియురాలి మోజులో పడిపోయిన తౌడు తన భార్య, పిల్లలు సహా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టాడు. తన బంధువులతో కలిసి భర్తపై నిఘా ఉంచిన జయంతి పాచిపెంట సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్ లో తన ప్రియురాలితో వున్నట్లు తెలుసుకుంది. ముందుగానే సాలూరు వన్ టౌన్ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చింది. పోలీసులు, బంధువులను వెంటబెట్టుకొని భర్త తన ప్రియురాలితో ఉన్న చోటుకు వెళ్లింది. అప్పటికే వారి రాకను గమనించిన తౌడు అక్కడి నుంచి పరారయ్యాడు. కానీ అతడితో ఎఫైర్ పెట్టుకున్న మహిళ మాత్రం దొరికిపోయింది. ఆమెను చూడగానే కోపంతో ఊగిపోయిన జయంతి దేహశుద్ధి చేసింది. ఆ తర్వాత భర్తతో పాటు అతడి ప్రియురాలిని స్థాని సచివాలయం వద్దకు తీసుకెళ్లి పంచాయతీ పెట్టింది. స్థానిక పెద్దలు తౌడికి నచ్చజెప్పి హెచ్చరించి పంపేశారు.  పోలీసులు మాత్రం కేసు నమోదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)