ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ కు కేసీఆర్ పరామర్శ

Telugu Lo Computer
0


తమిళనాడు పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీగా ఉన్నారు. మూడో రోజు కూడా కేసీఆర్ పలువురు ప్రముఖులతో భేటీ కానున్నారు. మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ విషయం కేసీఆర్ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో కావేరి ఆస్పత్రిలో ఐసియులో చికిత్స పొందుతున్న నరసింహన్ ను, ఆయన కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్ పరామర్శించినట్లు తెలుస్తోంది. ఐసియులో నరసింహన్‌కు చికిత్సనందిస్తున్నందున వైద్యులు సీఎం కేసీఆర్ ను దూరం నుంచి చూడడనికి మాత్రమే అనుమతినిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ దూరం నుంచే ఆయన్ని చూసి నరసింహన్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)