విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండేలా 'వైబ్రెంట్ గుజరాత్' పేరుతో విజయవాడ నుంచి ప్రత్యేక టూరిజం రైలు నడపనున్నట్లు ఐఆర్సీటీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ కిషోర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ యాత్రికుల ప్రత్యేక రైలు 2022 జనవరి 21వ తేదీ మధ్యాహ్నం విజయవాడ నుంచి బయలుదేరి 31వ తేదీ సాయంత్రం తిరిగి విజయవాడ చేరుతుంది. ఈ రైలుకు ఏలూరు, రాజమండ్రి, తుని, విశాఖపట్నం స్టేషన్లలో బోర్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు.ఈ పర్యటనలో సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనం, ద్వారకాదీష్ టెంపుల్తో పాటు సమీపంలోని ప్రముఖ దేవాలయాల దర్శనం, నాగేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం, శబరిమతి ఆశ్రమం, అక్షరథామ్ టెంపుల్, స్టాట్యూ ఆఫ్ యూనిటీ తదితర చారిత్రక ప్రాంతాలను చూపిస్తారు.