అజాగ్రత్తే ప్రాణం తీసింది..!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా శ్రీశైలం సమీపంలోని నల్లమల ఫారెస్ట్ ఘాట్ రోడ్డులో
కంటి రెప్పపాటులో ఘోరం జరిగింది. ఓ యువతి అజాగ్రత్త మూలంగా ప్రాణాలు కోల్పోయింది.  ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణం చేస్తున్న ఓ యువతి బస్సులో కిటికిలోంచి తలను బయటకు పెట్టిఫారెస్ట్ పరిశీలిస్తుంది. ఓ మలుపు వద్దకు చేరుకోగానే బస్సుకు ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో యువతి తలకు తీవ్రంగా దెబ్బ తగిలింది. బలమైన గాయాలైన యువతి అక్కడికక్కడే క్షణాల వ్యవధిలోనే ప్రాణాలను కోల్పోయింది. వెంటనే ఆర్టీసీ బస్సు డ్రైవర్ బస్సును నిలిపివేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ యువతి మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)