విశాఖలో కరోనా అలజడి

Telugu Lo Computer
0


 

విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఇండియా స్కిల్‌ కాంపిటేషన్స్‌లో భాగంగా అనేక రాష్ట్రాల నుంచి సుమారు 800 మంది విద్యార్ధులు హాజరయ్యారు. అయితే వీరిలో పలు రాష్ట్రాల నుంచి విశాఖకి వచ్చిన నలుగురు విద్యార్ధులకు కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అయితే వీరితో పాటు సన్నిహితంగా మెలిగిన మరో 25 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. అయినప్పటికి వీరిని ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఐసోలేషన్‌లో ఉంచారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విద్యార్ధులకు సంబంధించింది ఒమైక్రాన్‌ కాదని అధికారులు నిర్ధారించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)