బీజేపీ మాజీ ఎంపీ, కర్ణాటక రిటైర్డ్ డీజీపీ హెచ్.టి.సాంగ్లేన ప్రజాశాంతి పార్టీలో శనివారం చేరారు. అమీర్పేటలోని ఏ పాల్ పార్టీలో ప్రజాశాంతి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కోర్ కమిటీ నాయకులు విశ్రాంత ఐఏఎస్ రోశయ్య, పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోవింద సత్యశిలన్ దానా గౌడ్లు ఆయనను కండువా కప్పి ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ ఆదేశాల మేరకు సాంగ్లేనకు కర్ణాటక బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ నాయకులు రోశయ్య, గోవింద సత్యశిలన్ దానా గౌడ్లు తెలిపారు. ఈ సందర్భంగా సాంగ్లేన మాట్లాడుతూ కర్ణాటకలో పార్టీని జిల్లా, మండల, గ్రామస్థాయిలో విస్తరించేందుకు కృషి చేస్తానన్నారు.
కేఏ పాల్ పార్టీలో బీజేపీ మాజీ ఎంపీ చేరిక!
December 19, 2021
0