ఆంధ్రప్రదేశ్ లో మందుబాబుల సంబరాలు

Telugu Lo Computer
0


మద్యం పన్ను రేట్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్పులు చేయడంతో ఆదివారం నుండి ధరలు తగ్గాయి. వ్యాట్, అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ ప్రత్యేక మార్జిన్‌లో హేతుబద్ధతను తీసుకొచ్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ శనివారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వ్యాట్, అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గడంతో రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గినట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మద్యం షాపుల ముందు క్యూలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించటంతో ఆనందంలో మందు బాబులు చిందులేశారు. మద్యం షాపులకు వచ్చి హారతులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి పాటలు పాడుతూ ప్రత్యేక పూజలు చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం మధ్యం ధరలు తగ్గించటమే తమ ఆనందానికి కారణమంటున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)