ఇప్పటికీ నన్ను బాధిస్తుంది

Telugu Lo Computer
0


నిత్యా మీనన్ ఒకప్పుడు మంచి ఫామ్‌లో ఉండేది. కాని మధ్యలో ఆమెకు సరైన సక్సెస్‌లు రాకపోవడంతో కొన్నాళ్లు సైలెంట్ అయింది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తోంది. ఇక రీసెంట్‌గా డైరెక్టర్ విశ్వక్ తెరకెక్కించిన స్కైలాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీతో నిత్యామీనన్‌ నిర్మాతగా కూడా మారింది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ప్రభాస్‌కి సంబంధించిన విషయం షేర్ చేస్తూ బాధపడింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యా మీనన్ ని ప్రభాస్ గురించి అడుగగా. ఆయన గురించి నాకు తెలియదు అన్నారట. ఈ సంఘటన జరిగి దాదాపు దశాబ్దం అవుతుండగా. నిత్యా మీనన్ తాజాగా స్పందించారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తెలుగు సినిమాలు పెద్దగా చూడలేదు. నాకు తెలుగు సరిగా వచ్చేది కాదు. అందుకే టాలీవుడ్‌ సినిమాలు చూసేదాన్నికాదు. అదే సమయంలో నన్ను ప్రభాస్ గురించి అడిగారు.నాకు తెలియదని చెప్పాను. ఈ విషయాన్ని చాలా పెద్దది చేసి, నా అమాయకత్వాన్ని క్యాష్ చేసుకొని పెద్ద తప్పు చేసినట్టుగా వార్తలు రాసారు. జర్నలిస్టులు నా గురించి అలా రాయడంతో చాలా హర్ట్‌ అయ్యాను. నాకు తెలుగు సరిగా రాదు అని వారికి తెలుసు. ఆ ఇష్యూతో నిజాయితీగా అన్ని చోట్ల ఉండకూడదని,ఎక్కడా ఎలా ఉండాలో అలాగే ఉండాలని అర్థమైంది. ప్రభాస్‌ ఇష్యూ నన్ను ఇప్పటికి బాధ పెడుతుంది'అని నిత్యా చెప్పుకొచ్చింది.


Post a Comment

0Comments

Post a Comment (0)