సుబ్బారావు గుప్తాపై దాడి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశంజిల్లా ఒంగోలుకు చెందిన వైకాపా నాయకుడు సుబ్బారావు గుప్తాపై గుంటూరులో అదే పార్టీకి చెందిన కొందరు దాడి చేశారు. ఇటీవల వైకాపాలో కొందరి తీరుపై సుబ్బారావు గుప్తా విమర్శలు చేసిన నేపథ్యంలోనే ఆయనపై ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. సొంత పార్టీ నేతనే విమర్శించాడని వైకాపా శ్రేణులు దాడికి దిగారు. వైకాపా నేతల వైఖరిని విమర్శించిన సుబ్బారావు గుప్తా ఇంటిపై మొన్న రాత్రి వైకాపా శ్రేణులు దాడి చేశారు. దాడి అనంతరం తప్పించుకొని వెళ్లిన సుబ్బారావు.. గంటూరులోని లాడ్జిలో దాక్కున్నాడు. అతని సమాచారం తెలుసుకున్న వైకాపా కార్యకర్త సుభాని, మరికొందరు పార్టీ వారు మంత్రి బాలినేనినే విమర్శిస్తావా అంటూ లాడ్జికి వెళ్లి సుబ్బారావును కొట్టారు. ఎవరు చెబితే విమర్శలు చేశావని ప్రశ్నిస్తూనే కొట్టారు. అంతటితో ఆగకుండా మోకాళ్లపై కూర్చొబెట్టి, క్షమాపణ చెప్పించి వీడియో తీయించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)