మటన్ కిలో 50 రూపాయలు?

Telugu Lo Computer
0


ఒకప్పుడు కేవలం వారాంతంలో మాత్రమే చికెన్ మటన్ లాంటివి తినేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడే మాంసం తింటున్నారు. ఇటీవలి కాలంలో మటన్ చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి అనే విషయం తెలిసిందే. దీంతో మాంసం ప్రియులందరికీ షాక్ తగులుతూనే ఉంది. ప్రస్తుతం చికెన్ ధరలు 230 రూపాయల వరకు పలుకుతోంది. ఇక మటన్ ధరలు అయితే అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మటన్ కొనుగోలు చేయాలి అంటే దాదాపు 600 పైనే పడుతుంది అని చెప్పాలి. దీంతో సామాన్యులకు మటన్ తినడం అనేది చాలా కష్టంగానే మారిపోతుంది. దీంతో మటన్ తినాలని ఉన్నప్పటికీ చివరికి చికెన్ తోనే సరిపెట్టుకుంటున్నారు. అయితే బయట 600 రూపాయలు పలుకుతున్న కిలో మటన్ కేవలం 50 రూపాయలకే అమ్మితే ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ లోని  చిత్తూరు జిల్లా వాల్మీకిపురం గాంధీ బస్టాండ్ పక్కన భారీగా మటన్ షాపులు ఉండగా ఒక వ్యక్తి ఆదివారం సాయంత్రం 300 రూపాయలకే కిలో మటన్ అమ్మడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత మిగతా వారు అంతకంటే తక్కువగా అమ్మగా ఇలా ఒకరికి ఒకరు పోటీగా ధర తగ్గిస్తూ వచ్చి చివరికి 50 రూపాయలకే అమ్మారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)