సుదీర్ఘ ప్రయాణాల్లో మహిళలకు అసౌకర్యం కలుగకుండా రైల్వేశాఖ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకొన్నది. మెయిల్/ఎక్స్ప్రెస్ రైళ్లలో స్లీపర్ క్లాసులోని ఆరు బెర్తులను మహిళలకు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది.ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం తెలిపారు. గరీబ్ రథ్/రాజధాని/దురంతో రైళ్లలో 3ఏ, పూర్తి ఏసీ రైళ్లలో కూడా ఆరు బెర్తులను మహిళలకు కేటాయిస్తున్నట్టు తెలిపారు. స్లీపర్ క్లాస్లో ఒక కోచ్కి ఆరు నుండి ఏడు లోయర్ బెర్త్లు, ఎయిర్ కండిషన్డ్ 3 టైర్ (3ఎసి)లో ఒక్కో కోచ్కి నాలుగు నుండి ఐదు లోయర్ బెర్త్లు మరియు ఎయిర్ కండిషన్డ్ 2 టైర్ (2ఎసి) క్లాస్లలో ఒక్కో కోచ్కి మూడు నుండి నాలుగు లోయర్ బెర్త్లు రిజర్వేషన్ కోటా కింద కేటాయించినట్లు తెలిపారు. సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు పైబడిన మహిళా ప్రయాణికులు మరియు గర్భిణీ స్త్రీల కోసం కేటాయించామని ఆయన తెలిపారు.
రైళ్లలో మహిళలకు లోయర్ బెర్త్లు కేటాయింపు
December 18, 2021
0
Tags