అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కలిపి ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపుగా 250 కోట్ల వసూళ్లు చేసింది. సినిమా ను మొదటి నుండి పాన్ ఇండియా మూవీగా ప్రచారం చేస్తూ వచ్చారు. కాని తీరా సినిమా విడుదల సమయం లో ఉత్తరాదిన ప్రచారం చేయలేదు. తమిళనాట మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా అధికంగా ప్రచారం చేయలేదు. దాంతో సినిమాకు అక్కడ నష్టం తప్పలేదు. ముఖ్యంగా ఉత్తరాదిన రెండు మూడు రోజులు కేటాయించి అక్కడ యాక్టివ్ గా ప్రచారం చేసి ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితం దక్కేది అనడంలో సందేహం లేదు. కాని ఉత్తరాది పై సుకుమార్ పెద్దగా ఫోకస్ పెట్టలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో సుకుమార్ మాట్లాడుతూ ఉత్తరాదిన ఈ సినిమా ను విడుదల చేస్తున్నారు కాని జనాలు అక్కడ చూస్తారా అనుకున్నాను. కాని సినిమా అనూహ్యంగా ఈ స్థాయిలో వసూళ్లు దక్కించుకుంటుందని నేను అనుకోలేదు అన్నాడు. నార్త్ లో 45 కోట్ల వరకు ఈ సినిమా రాబట్టింది. లాంగ్ రన్ లో మరో అయిదు కోట్లు రాబట్టడం ఖాయం. 50 కోట్ల వరకు పుష్ప క్లోజ్ అవ్వబోతుంది. ప్రచారం చేయకుండానే 50 కోట్లు రాబట్టిన పుష్ప మంచి పబ్లిసిటీ చేసి హైప్ క్రియేట్ అయ్యేలా చేస్తే ఖచ్చితంగా పాతిక కోట్ల వరకు అదనంగా వసూళ్లను దక్కించుకునేది. అంటే మొత్తంగా 75 కోట్ల రూపాయలను ఈ సినిమా రాబట్టేది. కేవలం హిందీ లోనే ఆ స్థాయి వసూళ్లు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. పుష్ప సినిమా మరో రేంజ్ లో వసూళ్లు దక్కించుకుని ఉండేది. సౌత్ లో మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లను దక్కించుకుంది.
పుష్పకు ఉత్తరాదిన రూ. 25 కోట్ల నష్టం?
December 30, 2021
0
Tags