ప్రేమజంటకు రూ.25 వేలు జరిమానా!

Telugu Lo Computer
0


ఇద్దరు యువతీయువకులు కొద్దిరోజులు కలిసి జీవించినంత మాత్రాన సహ జీవనం అని చెప్పలేమని పంజాబ్, హరియాణా హైకోర్టు పేర్కొంది. తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల నుంచి రక్షణ కల్పించాల్సిందిగా ఓ ప్రేమ జంట వేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ జంటకు రూ.25వేల జరిమానా విధించింది. హరియాణా యమునానగర్‌కు చెందిన 18 ఏళ్ల అమ్మాయి, 20 ఏళ్ల అబ్బాయి తరఫున ఓ న్యాయవాది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇద్దరూ కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారని, అమ్మాయి తల్లిదండ్రులు వీరి ప్రేమను ఒప్పుకోవడం లేదని తెలిపారు. అబ్బాయికి పెళ్లి వయసు వచ్చే వరకు పెద్దల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. నవంబర్‌ 24నుంచి ఇద్దరూ ఓ హోటల్‌ గదిలో ఉంటున్నట్లు కోర్టుకు చెప్పారు. అమ్మాయి తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, ఆమెపై తప్పుడు కేసులు పెట్టాలని వారు చూస్తున్నారని పిటిషన్‌లో అబ్బాయి ఆరోపించాడు. అయితే ఈ ఆరోపణలు నమ్మశక్యంగా లేవని కోర్టు చెప్పింది. అమ్మాయి తల్లిదండ్రులపై పోలీస్‌ స్టేషన్‌లో కూడా కేసు నమోదు చేయలేదని గుర్తు చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)