ఉగాండా ఎయిర్‌పోర్ట్‌ చైనా స్వాధీనం

Telugu Lo Computer
0


అప్పులిచ్చి దారికి తెచ్చుకోవడం లేదా ఆస్తులను స్వాధీనం చేసుకోవడం చైనాకు వెన్నెతోపెట్టిన విద్య. ఉగాండా కూడా డ్రాగన్‌ కోరల్లో చిక్కుకుపోయింది. తమ దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చైనా లాగేసుకున్నా చూస్తూ కూర్చోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నది. 2015లో చైనాకు చెందిన ఎక్స్‌పోర్ట్‌-ఇంపోర్ట్‌ బ్యాంకు నుంచి ఉగాండా 207 మిలియన్‌ డాలర్లను (దాదాపు రూ.15,000 కోట్లు) అప్పుగా తీసుకుంది. ఈ అప్పును తీర్చకపోవడంతో ఎంటెబ్చే అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు మరికొన్ని ఆస్తులను చైనా స్వాధీనం చేసుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)