షుగర్‌, బీపీ రోగులకు ఉచితంగా మందులు !

Telugu Lo Computer
0


షుగర్, బిపి, హైబీపీ లాంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి వచ్చే నెల నుంచి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కిట్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం ఎం హెచ్ ఎం లో భాగంగా నిర్వహించిన సమీక్షలో ఈ కిట్లను అధికారులు పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా అసంక్రమిత వ్యాధులను గుర్తించడం లో భాగంగా పరీక్షలు నిర్వహించగా… 7 లక్షల మంది షుగర్ పేషెంట్లు, 20 లక్షల మంది బిపి పేషెంట్లు ఉన్నట్లు తేలింది. వీరందరికీ దశలవారీగా ఎన్సీడీ కిట్లను పంపిణీ చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. షుగర్ మరియు బీపీ నియంత్రణ మందులు అందించే ఈ కిట్లను ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించింది. 'ఉన్నతమైన జీవనానికి ఆరోగ్యకరమైన అలవాటు' అనే నినాదాన్ని కిట్లపై ప్రచురించింది. సమతుల ఆహారం,వ్యాయామం, మద్యం సేవించరాదు, యోగ ఇలాంటి ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి ఇందులో తెలిపారు. అలాగే కిట్ లో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో వేసుకునే మందులు నెలకు సరిపోయే షుగర్, బిపి మందుల నుంచి కిట్లను రోగులకు అందించనుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)