భుజం నొప్పితో బాలకృష్ ఆస్పత్రిలో చేరిక !

Telugu Lo Computer
0

 



సినీ నటుడు, హిందూపూర్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆస్పత్రిలో చేరారు. గత ఆరు నెలలుగా బాలకృష్ణ భుజం నొప్పితో బాధపడుతున్నారు. దీంతో అక్టోబరు 31వ తేదీన చికిత్స నిమిత్తం ఆయన బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రికి వెళ్లారు. ప్రముఖ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ రఘువీర్‌రెడ్డి, డాక్టర్‌ బి.ఎన్‌.ప్రసాద్‌ల బృందం నాలుగు గంటల పాటు శ్రమించి విజయవంతంగా శస్త్రచికిత్సను పూర్తి చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన 'అఖండ' విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నారు. దీని తర్వాత గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. మరోవైపు ప్రముఖ ఓటీటీలో 'అన్‌స్టాపబుల్స్‌' పేరుతో సెలబ్రిటీ ఇంటర్వ్యూలు చేస్తున్న సంగతి తెలిసిందే. 

Post a Comment

0Comments

Post a Comment (0)