ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా మండల కేంద్రమైన డెంకాడ గ్రామంలోని యాతవీధిలో శుక్రవారం తెల్లవారు జామున నిద్రిస్తున్నభార్య అచ్చియ్యమ్మపై గొర్లె శ్రీను తన అనుమానం పెంచుకున్న కత్తితో దాడి చేశారని ఎస్ఐ పద్మావతి తెలిపారు. స్ధానికులు 108కి ఫోన్ చేయడంతో గాయపడిన ఈమెను చికిత్స నిమిత్తం విజయనగరం కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్ధితి విషమంగా ఉండటంతో అక్కడ నుంచి విశాఖ కేజీహెచ్కు తరలించారు. పంచాయతీ కార్యదర్శి జగదీష్, వీఆర్వో రామారావుల సమక్షంలో నిందితుడు శ్రీనుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డెంకాడ ఎస్ఐ పద్మావతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిద్రిస్తున్న సమయంలో కత్తితో దాడి
November 27, 2021
0
Tags