బంగాళాఖాతంలో అల్పపీడనం

Telugu Lo Computer
0


తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో శ్రీలంక దగ్గర్లోని కొమరీన్ ఏరియాలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరం వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం కొద్దిగా బలహీనపడింది. దీంతో దాదాపు మూడు రోజులు తెలంగాణలో వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)