డ్యూటీ అంటే లెక్కలేదా?

Telugu Lo Computer
0



ఏం తమాషా చేస్తున్నావా? డ్యూటీ అంటే లెక్క లేదా? పని చేయాలనుకుంటున్నావా? లేదా? డ్యూటీ పట్ల ఇంత నిర్లక్ష్యమైతే ఎలా?' అంటూ చిత్తూరు జిల్లా  కణేకల్లు రెండో సచివాలయ ఏఎన్‌ఎం పర్థమ్మపై జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కణేకల్లు రెండో సచివాలయాన్ని జేసీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ పరిధిలో బాలింతలు, గర్భిణులు, చిన్నారుల గురించి ఏఎన్‌ఎం పర్థమ్మతో ఆరా తీశారు. ఆమె సరైన సమాధానం ఇవ్వకపోవడంతో రికార్డులు పరిశీలించారు. అందులో ఎలాంటి సమాచారాన్ని నమోదు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై వెంటనే డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కామేశ్వరరావుకు ఫోన్‌ చేసి సచివాలయ ఏఎన్‌ఎంల పనితీరుపై పర్యవేక్షణ లేకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)