ఆంధ్రప్రదేశ్ లోని అరకులోయలో 1170 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా స్థానిక ఎన్టీఆర్ గార్డెన్స్ వద్ద లారీలో తరలిస్తున్న 1170 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్ చేసి, ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఒడిషాలోని దారువ నుంచి ఉత్తరప్రదేశ్కు తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. ఐదుగురు నిందితుల్లో ముగ్గురు పరారీ అయ్యారు. ఇద్దరిని అరెస్టు చేశారు. పట్టుకున్న గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 35 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.
అరకులో గంజాయి పట్టివేత
November 24, 2021
0