ఆర్టీసీ బస్సు బోల్తా : 20 మందికి గాయాలు

Telugu Lo Computer
0


తెలంగాణ లోని వికారాబాద్‌ జిల్లాలో ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మర్పల్లి మండలం కల్కొడ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నది.  సంగారెడ్డి నుంచి తాండూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో 20 మంది ప్రయాణికులు ఉండగా.. పలువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. పరిస్థితి విషమంగా ఉన్నది. క్షతగాత్రులను మర్పల్లి ఆసుప్రతికి తరలించారు. అయితే, ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రయాణికులు ఆరోపించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Post a Comment

0Comments

Post a Comment (0)