పేర్నినానితో దిల్ రాజ్ భేటీ

Telugu Lo Computer
0


ఆంధ్ర ప్రదేశ్‌  మంత్రి  పేర్ని నాని తో టాలీవుడ్‌ సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. సచి వాలయం లో మంత్రి పేర్ని నాని తో సినీ నిర్మాత దిల్ రాజు, అలంకార్ ప్రసాద్, పలువురు ఇతర నిర్మాతలు, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు సమావేశమయ్యారు. నిన్నటి ఏపీ క్యాబినెట్ లో ఆల్ లైన్ లో సినిమా టికెట్ల విక్రయాల అంశం పై సినిమాటోగ్రఫీ చట్ట సవరణ కోసం చర్చ జరిగింది. ఈ నేపథ్యం లో ఇవాళ టాలీవుడ్‌ ప్రముఖులు మంత్రి పేర్ని నాని తో భేటీ అయ్యారు. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఏపీ నిర్ణయం పై టాలీవుడ్‌ ప్రముఖుల అభిప్రాయాలను ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని తెలుసుకోనున్నారు. వారి అభిప్రాయాల అనంతరం ఆన్‌ లైన్‌ టికెట్ల విధానం పై ఫైనల్‌ నిర్ణయం తీసుకోనుంది ఏపీ సర్కార్‌. కాగా గత కొన్ని రోజులు గా ఆన్‌ లైన్‌ టికెట్‌ విధానం పై తీవ్ర సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. 

Post a Comment

0Comments

Post a Comment (0)