లారీ ఢీ కొని అంగన్‌వాడీ ఆయా మృతి

Telugu Lo Computer
0



రోడ్డు ప్రమాదంలో ఓ అంగన్‌వాడీ ఆయా మృతి చెందిన సంఘటన జిల్లాలోని కంది మండల పరిధిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. సంగారెడ్డి రూరల్‌ ఎస్‌ఐ సుభాష్‌, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డెన్నగూడతండా గ్రామ పంచాయతీ పరిధిలోని కొయ్యగూడతండా అంగన్‌వాడీ కేంద్రంలో బానోత్‌ చావలి (43) ఆయాగా పని చేస్తుంది.శుక్రవారం విధులు ముంగించుకుని ఇంటి వెళుతున్న క్రమంలో రోడ్డు దాటుతుండగా ఇస్మాయిల్‌ఖాన్‌పేట నుంచి గణేశ్‌గడ్డకు వెళ్తున్న ఓ లారీ అతివేగంగా వచ్చి ఆమె ఢీకొట్టింది.దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెతో పాటు ఉన్న నేనావత్‌ చాల్కికి కూడా బలమైన గాయాలు కావడంతో స్థానిక బాలాజీ దవాఖానకు మెరుగైన చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)