ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా వత్సవాయి మండలం కంభంపాడు గ్రామంలో సంవత్సరం వయసుగల చిన్నారిపై కుక్క దాడి చేసింది. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా గ్రామంలో కుక్కలు విపరీతంగా పెరిగి తిరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.