తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ కలకలం..!

Telugu Lo Computer
0



కరోనా ఏవై4.2 వేరియంట్లు దేశంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో బయటపడగా, తాజాగా తెలంగాణలో కూడా ఈ వేరియంట్ ను గుర్తించినట్టు తెలుస్తోంది. ఇద్దరిలో ఈ తరహా వైరస్ ను గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని జీఐఎస్ఏఐడీ తెలిపింది. గత నెలలో తెలంగాణలో నమోదైన కేసులకు చెందిన 274 మంది రక్త నమూనాలను హైదరాబాదులోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లేబొరేటరీలో జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా, వీటిలో రెండు ఏవై4.2 రకం కేసులు ఉన్నట్టు తేలిందని వెల్లడించింది. ఈ రెండు కేసులు 48 ఏండ్ల పురుషుడు, 22 ఏండ్ల మహిళవి. ఈ రెండు కేసుల వివరాలను గోప్యంగా ఉంచుతున్నట్టు తెలుస్తోంది. వారు ఇప్పుడు ఎలా ఉన్నారు? వారు పూర్తిగా కోలుకున్నారా? అనే విషయాల్లో క్లారిటీ లేదు. తెలంగాణ వైద్యాధికారులు కూడా అప్రమత్తమైనట్లు  తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)