బస్సు లోయలో పడి 10 మంది మృతి

Telugu Lo Computer
0


జమ్మూకశ్మీర్‌లో థాత్రి నుంచి దోడాకు వెళ్తున్న మినీ బస్సు గురువారం తెల్లవారుజామున అదుపు తప్పి లోయలో పడింది. దాంతో 10 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాన మంత్రి మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన కోరుకున్నారు. అలాగే మృతి చెందిన వారికి రూ.2 లక్షల చొప్పున నష్ట పరిహారం, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)