నేను' అన్న అహంభావము

Telugu Lo Computer
0


ఒక రాజు బహిరంగ సభ ఏర్పాటు చేసి పండితులను, పామరులను పిలిపించాడట. ఆ సభలో ఆయన మీలో ఎవరైనా స్వర్గానికి పోగలిగిన వారెవరైనా వున్నారా? అని అడిగాడట. అందరూ ఇదేమి ప్రశ్న అని నివ్వెర పోయారట. ఎవరూ  సమాధానము చెప్పక పోవుటచే ,ఇంతమంది పండితులూ,కవులూ  వున్నారే  ఎవరూ వెళ్ళలేరా?అన్నాడు. ఒక పసుల కాపరి లేచి మహారాజా నేను పొతే పోవచ్చును అన్నాడట. సభలో అందరూ నిర్ఘాంత పోయారట. ఇంతమంది కవులూ పండితులూ వెళ్ళలేరు నీవెలా వెళ్ళగలవు?అన్నాడట రాజు. అప్పుడు ఆ పసుల కాపరి మహా  రాజా నేను పోతానని అనలేదు, 'నేను' అన్న అహంభావము పొతే స్వర్గానికి పోవచ్చును అన్నాను అని జవాబిచ్చాడట.అప్పుడు రాజు అతన్ని గౌరవించి తగిన పారితోషికము యిచ్చి పంపించా డట.

Post a Comment

0Comments

Post a Comment (0)