మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి

Telugu Lo Computer
0


క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలు చేపట్టాలని మంత్రులను ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఆదేశించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జగన్ సూచించారు. సుదీర్ఘంగా సాగిన కేబినెట్ సమావేశం ముగిసింది. సమావేశంలో జగన్ మాట్లాడారు. పెన్షన్ల కోత విషయంలో ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని సీఎం సూచించారు. అర్హులకు మేలు జరిగేలా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని ప్రజలకు వివరించాలని జగన్ ఆదేశించారు. ధనికులను కూడా పెన్షన్ లబ్ధిదారుల జాబితాలో గత టీడీపీ ప్రభుత్వం చేర్చిందన్నారు. అర్హులకు గత టీడీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు.  విద్యుత్ భారం కూడా గత ప్రభుత్వానిదేనని మంత్రులు అన్నారు. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టేలా క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని మంత్రులను సీఎం ఆదేశించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)