డీఆర్డీవో ఉద్యోగాల పేరుతో మహిళా న్యాయవాదికి ఓ వ్యక్తి టోకరా వేశాడు. రైసు పుల్లింగ్ పేరుతో పరిచయం చేసుకొని రూ.65 లక్షలు వసూలు చేసాడు. నూజివీడుకు చెందిన నిందితుడు విద్యాసాగర్ను సైబర్ పోలీసులు అరెస్టు చేసారు. ఢిల్లీలో సైతం ఓ వ్యాపారవేత్తకు టోకరా వేసి రూ.17 లక్షలను విద్యాసాగర్ కాజేసాడు. నిందితుడిపై ఇప్పటికే విజయవాడ పీఎస్లో నకిలీ పత్రాల కేసు నమోదయింది. విద్యాసాగర్ నుంచి రూ.7 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.