హైదరాబాద్ లోని శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తూముకుంట దగ్గర రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని కరీంనగర్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే మహిళ మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్ జాతీయ రహదారి కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Post a Comment
0Comments
3/related/default