భారత మార్కెట్లోకి ఫోక్స్వేగన్ టైగన్ అడుగుపెట్టింది. వేరియంట్ను బట్టి ఈ ఎస్యూవీ ఎక్స్షోరూమ్ ధర రూ.10.49 లక్షల నుంచి 17.49 లక్షల వరకు ఉంది. దీనిలో ఫీచర్ల ఆధారంగా టైగన్ 1.0 కంఫర్ట్ లైన్, హైలైన్, హైలైన్ ఏటీ, టాప్లైన్ ఎంటీ, టాప్లైన్ ఏటీ, 1.5 టీఎస్ఐ జీటీ లైన్, 1.5 టీఎస్ఐ జీటీ లైన్ ప్లస్ వేరియంట్లను సిద్ధం చేశారు. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ కారును లుక్స్లో చాలా స్టైలిష్గా తీర్చిదిద్దారు. అత్యాధునిక సౌకర్యాలు మొత్తం అందుబాటులోకి తెచ్చారు. దీనిని స్కోడా కుషాక్ను తయారు చేసిన MQB-A0-IN ప్లాట్ ఫామ్పైనే దీనిని కూడా డిజైన్ చేశారు. ఈ ప్లాట్ఫామ్ను పూర్తిగా భారత రహదారి ప్రమాణాలకు అనుకూలంగా అభివృద్ధి చేశారు. టైగన్ను ఇప్పటికే దేశవ్యాప్తంగా 12,221 మంది బుకింగ్ చేసుకొన్నారు.
మార్కెట్లోకి ఫోక్స్వాగన్ టైగన్
September 23, 2021
0