ఎమ్మెల్యేతో నాకు ప్రాణ హానీ
September 20, 2021
0
గుంటూరు జిల్లా ఎస్పీ, ఐజీలను నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రమణ్యం కలిశారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే విడదల రజనీ మనుషులే తనను హతమార్చే పధకం పన్నినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. యడవల్లి సొసైటీ భూములు రైతులకు అండగా నిలిచినందుకు తనపై కుట్ర పన్నారని అవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రజనీ కుటుంబ సభ్యులు ఇప్పటికే తనకు ఫోన్ చేసి హెచ్చరించారని తెలిపారు. ఎమ్మెల్యే విడదల రజనీ నుంచి తనకు ప్రాణ హానీ ఉందని రక్షణ కల్పించాలని కోరారు.