రెచ్చిపోయిన ఏనుగులు...!

Telugu Lo Computer
0


అసోంలోని గౌహతి నగర శివార్ల బీజేపీ నాయకుడు రాజీవ్ బోరోను ఏనుగులు తొక్కి చంపాయి. గువహటి సిటీ శివార్లలోని రాణి రిజర్వ్ ఫారెస్టులో ఉంటున్న ఏనుగుల మంద.. సోమవారం అర్ధరాత్రి రోడ్డుపైకి వచ్చింది. ఆ తరువాత అంధురిజులి గ్రామంలోని 35 ఏళ్ల బీజేపీ శక్తి కేంద్ర కన్వీనర్ బోరో నివాసంపై ఏనుగులు దాడి చేశాయి. నేరుగా అతని ఇంటిలోకి దూసుకెళ్లిన ఏనుగులు ఇంట్లో నిద్రిస్తున్న బోరోను ఏనుగులు తొక్కడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. బోరో మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని రాణి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. కానీ అప్పటికే బోరో మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పర్యావరణ, అటవీశాఖ మంత్రి పరిమల్ శుక్లబైద్యా సంతాపం ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)