బీజేపీకి ముగింపు పలుకుతాం

Telugu Lo Computer
0


బీజేపీని ఓడించడానికి తృణమూల్ కాంగ్రెస్ ఒక్కటే చాలు అని భవానీపూర్ నుంచి ఆట మొదలుపెట్టి దేశవ్యాప్త విజయంతో బీజేపీకి ముగింపు పలుకుతామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. వాటికన్‌ సిటీలో నిర్వహించనున్న ప్రపంచ శాంతి సదస్సులో పాల్గొనేందుకు తనకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అనుమతి నిరాకరించడంపై ఆమె మండిపడ్డారు. భవానీపూర్ ఉప-ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ రోమ్‌లో జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు తనకు ఆహ్వానం అందిందని, ఆ సదస్సుకు జర్మనీ ఛాన్సెలర్, పోప్ ఫ్రాన్సిస్ తదితరులు హాజరవుతున్నారని తెలిపింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇటలీ తనకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. కానీ, కేంద్రం మాత్రం అనుమతి నిరాకరించిందని తెలిపారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఈ సమావేశం సరైంది కాదని చెబుతోందని అన్నారు. విదేశాలలో పర్యటించడానికి తను ఆసక్తి చూపడం లేదని, కానీ ఇది దేశ గౌరవానికి సంబంధించింది అని చెప్పింది.

'మీరు (ప్రధాని మోదీ) హిందువుల గురించి మాట్లాడుతూ ఉంటారు. నేను కూడా ఒక హిందూ మహిళను, మీరు నన్ను ఎందుకు అనుమతించడం లేదు? మీరు పూర్తిగా అసూయపడుతున్నారు` అని మమతా అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)