మణిరత్నంపై కేసు!
September 03, 2021
0
ప్రముఖ దర్శకుడు మణిరత్నంపై కేసు నమోదైంది. ఆయన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'పొన్నియిన్ సెల్వన్` చిత్రీకరణలో ఓ గుర్రం చనిపోయిందని పెటా ప్రతినిధులు.. హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గుర్రం యజమాని, సినిమా నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ బ్యానర్, మణిరత్నంలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. గత నెలలో అబ్దుల్లాపూర్మెట్ మండలం అనాజ్పూర్ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాల్లో 'పొన్నియిన్ సెల్వన్` అనే సినిమా షూటింగ్ చేశారు. అయితే ఓ యుద్ధ సన్నివేశం కోసం ఏకధాటిగా చిత్రీకరణ చేయడంతో డీహైడ్రేషన్ కారణంగా ఓ గుర్రం చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పెటా ప్రతినిథులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.