పవన్ కళ్యాణ్ తో మాకు సంబంధం లేదు

Telugu Lo Computer
0



రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు, సినీ పరిశ్రమకు ఎటువంటి సంబంధం లేదని అప్పుడే పరిశ్రమ ఒక లేఖను విడుదల చేసారు. ఈరోజు టాలీవుడ్‌ సినీ నిర్మాతలు మంత్రి పేర్ని నాని ఇంటికి క్యూ కట్టారు. పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు ఆయన వ్యక్తిగతమని, ఆ వ్యాఖ్యలతో సినీ పరిశ్రమకు ఎటువంటి సంబంధం లేదని మళ్ళీ తెలియచేసారు టాలీవుడ్ నిర్మాతలు. సినీ పరిశ్రమకు చాలా సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలకు ప్రభుత్వం చొరవ చూపుతుందని మాకు నమ్మకం ఉందని నిర్మాతలు మరియు మంత్రి పేర్ని నాని మీడియాకు తెలియచేసారు. ఆన్లైన్ టిక్కెటింగ్ విధానం ముందు నుంచే ఉందని కానీ ప్రభుత్వం దానిని హ్యాండిల్ మాత్రమే చేస్తుందని, ఆన్లైన్ టిక్కెటింగ్ విధానం విషయంలో సినీ పరిశ్రమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రస్తుతం థియేటర్లలో 50 శాతం ఆక్యూపెన్సీని అమలు చేస్తున్నారని నిర్మాతలు దానిని 100 శాతానికి పెంచాలని కోరారని త్వరలోనే 100 శాతం ఆక్యూపెన్సీ చేస్తామని మంత్రి తెలిపారు. టికెట్‌ రేటు కూడా పెంచాలని ఇండస్ట్రీలో ప్రొడక్షన్ కాస్ట్ బాగా పెరిగిందని ప్రస్తుతం ఉన్న రేట్లతో సినిమాలను నిర్మించడం మరియు థియేటర్లలో రిలీజ్ చేయడం కష్టమని నిర్మాతలు తెలిపారని, ముఖ్యమంత్రి జగన్ తో చర్చించి తెలియచేస్తామని మంత్రి తెలిపారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు దిల్‌ రాజు, గీతా ఆర్ట్స్ 2 బన్ని వాసు, యూ వీ క్రియేషన్స్ వంశీ రెడ్డి, మైత్రీ మూవీ బ్యానర్ నవీన్‌ మొదలైన వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)