షట్టర్ తాళాలు పగులగొట్టి రూ.35 నగదును గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. హైదరాబాద్ లోని హయత్నగర్ ఆర్టీసీ కాలనీలో ఉన్న అపోలో ఫార్మసీలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఆదివారం ఉదయం షాపు తెరిచేందుకు వచ్చిన నిర్వాహకుడికి తాళాలు పగులగొట్టి కనిపించడంతో, హయత్నగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్లూస్ టీంను పిలిపించి వేలి ముద్రలను సేకరించారు. ఫార్మసీ నిర్వాహకుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.