మధ్యప్రదేశ్ ఇండోర్లోని మావ్లో 'ఆర్మీవార్ కాలేజ్'లో కరోనా కలకలం రేపింది. ఇటీవల హయ్యర్ కమాండ్ కోర్సు పూర్తి చేసుకొని వచ్చిన వారిలో 30మంది సైనిక అధికారులకు వైరస్ సోకింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది కళాశాలను తాత్కాలికంగా మూసివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కళాశాల మూసివేసి ఉంచుతున్నట్టు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ కాలేజ్లో వచ్చిన 30 కేసులతో పాటు మొత్తం ఇండోర్ జిల్లాలో తాజాగా 32 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు బులిటెన్లో వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన సైనిక అధికారుల్లో కొవిడ్ లక్షణాల్లేవని, అంతా టీకాలు తీసుకున్నవారేనని ఇండోర్ చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ బీఎస్ సతియా వెల్లడించారు. ప్రస్తుతం వారంతా ఐసోలేషన్లో ఉన్నట్టు తెలిపారు. కొవిడ్ నిబంధనల ప్రకారం.. ఇటీవల హయ్యర్ కమాండ్ శిక్షణ పూర్తిచేసుకొని తిరిగివచ్చిన 115 మంది అధికారులను క్వారంటైన్లో ఉంచి పరీక్షలు నిర్వహించినట్టు ఆరోగ్యశాఖ అధికారులు వివరించారు. ఇప్పటివరకు మొత్తంగా 60శాంపిల్స్ను ఇండోర్లోని వైరాలజీ ల్యాబ్కు పంపగా.. గత రెండు రోజుల వ్యవధిలో 30మంది మిలటరీ అధికారులకు పాజిటివ్గా తేలిందన్నారు.
30మంది సైనికాధికారులకు పాజిటివ్!
September 24, 2021
0