టీఎంసీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యే

Telugu Lo Computer
0


భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు చేస్తోందని బీజేపీకి గుడ్‌ బై చెప్పి టీఎంసీలో చేరిన ఎమ్మెల్యే తన్మయ్‌ ఘోష్‌ విమర్శించారు. తృణముల్‌ కాం‍గ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, విద్యాశాఖ మంత్రి బ్రత్యాబసు ఆధ్వర్యంలో టీఎంసీలో చేరిన తన్మయ్‌ ఘోష్‌.. బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ రాష్ట్రంలో నియంతృత్వ చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. బెంగాలీ ప్రజల హక్కులను బీజేపీ కాలరాస్తోందంటూ ధ్వజమెత్తారు. బీజేపీ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తోందని ఆరోపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)