భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) పాలసీదారులు ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రద్దైన పాలసీలను తిరిగి అమల్లోకి తీసుకొచ్చేందుకు ఎల్ఐసీ ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. 'స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్' పేరుతో ఆగస్టు 23, 2021 ప్రారంభించింది. అక్టోబరు 22, 2021 వరకు ఇది కొనసాగుతుందని ఎల్ఐసీ వెల్లడించింది. గత ఐదేళ్లుగా ప్రీమియం చెల్లించకుండా ఉన్న పాలసీలను పునరుద్ధరణ చేసుకునేందుకు ఈ పథకంలో వీలవుతుందని ఎల్ఐసీ తెలిపింది. ప్రీమియం చెల్లింపునకు అవకాశం ఉండి, ఇంకా వ్యవధి ఉన్న పాలసీలను కొన్ని నిబంధనల మేరకు తిరిగి అమల్లోకి తీసుకురావచ్చు. చెల్లించాల్సిన ప్రీమియాలకు లేట్ ఫీలో కొంత సబ్సిడీ ఇస్తున్నట్లు ఎల్ఐసీ పేర్కొంది.
Post a Comment
0Comments
3/related/default