కాల్పులు - ఒకరు మృతి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలోని మాచర్ల మండలం రాయవరంలో కాల్పలు కలకలం రేగింది. పొలం వివాదంలో రెండు వర్గాల మద్య ఘర్షణ చోటుచేసుకుంది. మాజీ ఆర్మీ జవాన్ మట్టా సాంబశివరావు నాలుగు రౌండ్‌లు కాల్పులు జరిపారు. ఘర్షణలో మట్టా శివ అనే వ్యక్తి మృతి చెందాడు. ఆంజనేయులు, బాలకృష్ణ అనే ఇద్దరి పరిస్దితి విషమంగా ఉంది. వారిని మాచర్ల ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)