పోలీసులను బురిడీ కొట్టించిన 'టిక్‌ టాక్‌' మహిళ

Telugu Lo Computer
0

 

'టిక్‌ టాక్‌' మహిళగా పేరొందిన సూర్యాదేవి మరోమారు పోలీసులను బురిడీ కొట్టించింది. ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు వీడియో పంపించి ఇంట్లో హాయిగా నిద్రపోయిన విషయం పోలీసుల విచారణలో వెలుగుచూసింది. తిరుచ్చి జిల్లా మనప్పారై గాంధీ నగర్‌కు చెందిన సూర్యాదేవి రాజకీయాలు, సినిమా, పలు రంగాలకు చెందిన ప్రముఖులను విమర్శిస్తూ సోషల్‌ మీడియాలో వీడియోలు విడుదల చేసి ఇమేజ్‌ సంపాదించుకుంది. ఇటీవల నటి వనిత విజయ్‌ కుమార్‌ను విమర్శిస్తూ సోషల్‌ మీడియాలో ప్రసారం చేసిన ఆడియో కలకలం రేపింది. సూర్యాదేవి వల్ల నష్టపోయిన పలువురు ఆమెపై పలు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, ఓ కేసుకు సంబంధించి సూర్యాదేవిని విచారించేందుకు మదురై పోలీసులు కొన్నిరోజుల క్రితం మనప్పారై వెళ్లారు. ఆ సమయంలో సూర్యాదేవి ఇంటికి తాళం వేసి ఉండడం చూసి వెనుదిరిగారు. ఇదిలా ఉండగా, మంగళవారం మదురై నగర పోలీస్‌ కమిషనర్‌కు తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు చిత్రీకరించిన వీడియోను పంపించింది. అర్ధరాత్రి 12 గంటలకు సూర్యాదేవి ఇంటికెళ్లిన పోలీసులు తలుపులు మూసి ఇంట్లో ఆమె ఉన్నట్లు నిర్ధారించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందిని పిలిపించి తలుపులు బద్దలుకొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా, సూర్యాదేవి నిద్రపోతుండడం చూసి ఆమెను లేపి, ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని మందలించి వెళ్లిపోయారు.

Post a Comment

0Comments

Post a Comment (0)