తెలిసినవాళ్లు
August 02, 2021
0
రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ జంటగా విప్లవ్ కోనేటి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'తెలిసినవాళ్లు'. 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకొంది. "చక్కని ప్రేమకథతో రూపొందుతున్న సినిమా ఇది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తాం'' అని దర్శకుడు తెలిపారు. నరేష్, పవిత్ర లోకేష్, జయ ప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని సిరెంజ్ సినిమా సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో హీరో ఫస్ట్ లుక్ను సోమవారం విడుదల చేశారు.