ప్రముఖ నటి శ్రీదేవి గారాల పట్టి జాన్వీకపూర్ తాను తిరుపతిలో సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుంటానని ప్రకటించింది. తనదైన శైలిలో గ్లామర్ పాత్రలతోపాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ జాన్వీ నటనలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఆమె ప్రస్తుతం 'గుడ్ లక్ జెర్రీ'తో పాటు ఓ దక్షిణాది చిత్రం హిందీ రీమేక్లో నటిస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి జాన్వీ మనసులో మాట బయటపెట్టింది. ''పెళ్లి తంతు రెండు మూడు రోజుల్లో ముగిసిపోవాలి. కాప్రి ఐల్యాండ్లో ఓ ప్రైవేట్ బోట్లో నా గ్యాంగ్తో కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకున్నాకా తిరుపతిలో నా పెళ్లి చేసుకుంటాను. మెహందీ, సంగీత్ కార్యక్రమాలు చెన్నైలోని మైలాపూర్లో ఉన్న అమ్మ నివసించిన ఇంటిలోనే జరుగుతాయి. పెళ్లికి దక్షిణాది సంప్రదాయ చీర ధరించాలనేది నా కోరిక'' అని చెప్పింది.
తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటా!
August 03, 2021
0