మంత్రి తల తెస్తే రూ.51 లక్షలు !

Telugu Lo Computer
0

 

విశ్వహిందూ సేన జాతీయ అధ్యక్షుడు అరుణ్ పాఠక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రి నారాయణ్ రాణె తల తెస్తే రూ. 51 లక్షలు రివార్డు ఇస్తానని ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఫేస్ బుక్, ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశారు. అందులో 'రోడ్డు పక్కన పర్స్లు కొట్టుకుని, టికెట్లు అమ్ముకుని బతికే నారాయణ్ రాణెకు శివసేన, బాలాసాహెబ్ రాజకీయ భిక్ష పెట్టారు. ప్రస్తుతం ఆయన అవి మర్చిపోయి హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. బాలాసాహెబ్ కుమారుడు, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పైనే విమర్శలు చేస్తున్నారు. అలాంటి వారికి శిరచ్ఛేదనం చేయాలి. ఈ పని ఎవరు చేసిన వారికి రూ. 51 లక్షలు ఇస్తాను.` అని ఆయన పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)