కేంద్రంవల్లే తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం

Telugu Lo Computer
0


కేంద్ర ప్రభుత్వం తీరు కారణంగానే తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం వస్తోందని  ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్ టి. లక్ష్మినారాయణ విమర్శించారు. గెజిట్ నోటిఫికేషన్‌తో భవిష్యత్‌లో నీటి తగాదాలు ఈ స్థాయిలో ఉండవన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం లేదని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయవద్దని, వెలిగొండను గెజిట్‌లో పెట్టేలా సీఎం జగన్‌ కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. జగన్ వ్యూహం లేకపోవడంతో సీఎం కేసీఆర్బుట్టలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడని లక్ష్మినారాయణ విమర్శించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)