అత్యాధునిక వైద్య సదుపాయాలు రాష్ట్రంలో లేవని సీఎం జగన్ తెలిపారు. విభజనతో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు ఏపీలో లేవని పేర్కొన్నారు. కరోనాను అడ్డుకోవడంలో గ్రామ, వార్డు సచివాలయాలు సమర్థవంతంగా పనిచేశాయని కొనియాడారు. ఇప్పటివరకు 12 సార్లు ఇంటింటికీ పీవర్ సర్వే చేశామని, కొవిడ్కు సరైన పరిష్కారం వ్యాక్సినేషనేనని స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆస్పత్రులు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్లు ఇవ్వలేకపోతున్నాయని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులకు జూన్లో 17,71,580 డోసులు కేటాయిస్, కేవలం 4,20,209 డోసులు మాత్రమే వినియోగించారని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రులు వినియోగించని స్టాక్ను రాష్ట్రానికి కేటాయించాలని జగన్ కోరారు.