ఎర్రచందనం దుంగలు స్వాధీనం - విలేకరి అరెస్ట్

Telugu Lo Computer
0

 

చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం ఏఎంపురం సమీప అటవీ ప్రాంతంలోని ఓ పూల తోటలో డంప్ చేసి వున్న  పది ఎర్రచందనం దుంగలను సత్యవేడు ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబందించి ఒక దిన పత్రికలో విలేకరిగా  పని చేస్తున్న గోపిరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో వ్యక్తి రవీంద్రనాధ్ రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సేకరించిన ఎర్ర చందనం దుంగలను గోపిరెడ్డి తన పూల తోటలో దాచి పెట్టి రాత్రి వేళల్లో అక్రమ రవాణాకు పాల్పడేవడని ఎఫ్‌ఆర్‌వో జయప్రసాదరావు తెలిపారు. ఇందుకు రవీంద్రనాధ్ రెడ్డి సహకరిస్తున్నట్లు చెప్పారు. పట్టుబడ్డ ద్విచక్ర వాహనంతో పాటు దుంగల విలువ మూడు లక్షల రూపాయలు ఉంటుందని ఎఫ్‌ఆర్‌వో తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)