తక్కువ ధరకే ఎక్కువ స్పెసిపికేషన్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న చైనీస్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ షియోమీ అమ్మకాల జోరు కొనసాగిస్తుంది. అందులోనూ ఇటీవల ఫోన్లను వరుసగా లాంచ్ చేస్తూ అమ్మకాలను విపరీతంగా పెంచుకుంది. దీంతో ప్రపంచవ్యాప్త మొబైల్ అమ్మకాల్లో దిగ్గజ సంస్థ యాపిల్ను షియోమీ దాటేసింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ఫోన్ అమ్మకందారుగా తొలిసారి నిలిచింది. చైనాలో తనకు పోటీగా ఉన్న హువావేపై తీవ్రమైన దెబ్బ పడడం కూడా షియోమీకి కలిసి వచ్చింది. మొత్తంగా ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అమ్మకాల్లో సత్తాచాటింది. ఏప్రిల్-జూన్ క్వార్టర్లో 19 శాతం అమ్మకాలతో స్మార్ట్ఫోన్ల అమ్మకంలో మరోసారి సామ్సంగ్ అగ్రస్థానంలో నిలువగా.. 17 శాతం షేర్తో షియోమీ తొలిసారి రెండో స్థానానికి చేరిందని మార్కెట్ పరిశోధన సంస్థ కెనాలిస్ నివేదిక వెల్లడించింది. యాపిల్ను షియోమీ తొలిసారి అధిగమించిందని తెలిపింది. కాగా ఈ మూడు నెలల కాలంలో యాపిల్ 14 శాతం మార్కెట్ షేర్ అమ్మకాలతో మూడో స్థానంలో నిలిచిందని, వివో, ఒప్పో అమ్మకాలు కూడా భారీగా పెరిగి టాప్-5లో కొనసాగాయని పేర్కొంది.
Post a Comment
0Comments
3/related/default