ఇండోనేషియాలో భూకంపం
July 10, 2021
0
ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేల్ పై 6.1గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఉత్తర సులవేసి మనడో ప్రాంతానికి 258 కిలోమీటర్లు భూకంప కేంద్రంగా గుర్తించారు. భూకంప ధాటికి ప్రాణ, ఆస్తినష్టం సంభవించదనేది తెలియరాలేదు. తరచూ ఇక్కడ భూమి కంపిస్తున్నదనే సంగతి తెలిసిందే. ఈ దేశం భౌగోళికంగా ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అనే గీత మీద ఉందని, ఈ గీత మీద తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటనాలు సంభవిస్తుంటా యని శాస్త్రవేత్తలు చెపు తుంటారు.